12, డిసెంబర్ 2009, శనివారం

రేపు తెలుగు బ్లాగుల దినోత్సవం. బ్లాగరులందరూ ఒకచోట కలుసుకుంటున్నారు.

ప్రతి సంవత్సరం డిసెంబరు 2 వ ఆదివారం ను తెలుగు బ్లాగుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా రేపు తెలుగు బ్లాగరులందరూ ప్రతీ ప్రధాన నగరాల లోనూ కలుసుకోవడము, బ్లాగుల బాగోగుల గురించి చర్చించుకోవడము చేస్తున్నారట. నాకెందుకో మన తెలుగు బ్లాగరులతో కొత్త స్నేహం మొదలుపెట్టడానికి ఇది మంచి అవకాశంలాగా కనిపిస్తోంది. మనం అందరం కలుసుకోవచ్చన్న ఊహే చాలా ఉత్సాహాన్నిస్తోంది. ఎంత ఎక్కువమందిమి వస్తే అంత బాగుంటుంది రేపటి సాయంత్రం.

మన భాగ్యనగరంలో ఈ సమావేశం జరిగే

స్థలం : కృష్ణ కాంత్ ఉద్యాన వనం, యూసఫ్ గూడా బస్తీ .
సమయం : రేపు అనగా డిసెంబర్ 13 న సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు.

4 కామెంట్‌లు:

  1. తప్పకుండా కలుద్దాం శర్మగారు...వ్యాపార సమావేశాలకి, కుటుంబ సమావేశాలికి హాజరవ్వడమే తెలుసు ఇంతకాలం. ఇప్పుడు పరోక్షంగా తెలిసిన వ్యక్తులను ప్రత్యక్షంగా కలవగలిగే ఈ సమావేశానికి హాజరవ్వాలని చాలా ఉత్సుకతగా ఉంది.

    రిప్లయితొలగించండి
  2. స్వాగతం రాజన్ గారు. మనం అక్కడ కలుద్దాం.

    రిప్లయితొలగించండి
  3. ఉమ గారు:నాకు తెలియదండీ. మీరో పని చెయ్యవచ్చు. ఓ సారి తెలుగుబ్లాగు అనే గ్రూపులో అడిగి చూడండి. తెలియవచ్చు.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.