12, డిసెంబర్ 2009, శనివారం

భాగ్యనగరంలో జరిగే పుస్తక ప్రదర్శనలో తెలుగు బ్లాగరులం అందరం కలుద్దాం

మన భాగ్యనగరంలో ఈ నెల 17 నుండీ 27 వరకు నెక్లెస్ రోడ్డులో పుస్తక ప్రదర్శన జరగనున్నది. ఆ ప్రదర్శనలో భాగంగా మన ఇ-తెలుగు వారిచేత ఒక స్టాలు నిర్వహించ బడుతున్నది. ఈ స్టాలులో అంతర్జాలంలో మన తెలుగు అభివృద్ధిని గురించి వచ్చిన వారికి వివరించబడుతుంది.

అందులో భాగంగా తెలుగులో బ్లాగుల పరిచయం, వాటి పురోగతి మొదలగు విషయాలను తెలియజేయడం జరుగుతుంది. మిరు భాగ్యనగరం వారై ఉండి, బ్లాగును నిర్వహిస్తున్నట్లైతే మీ బ్లాగుని పరిచయం చేసుకునే అవకాశం కూడా అక్కడ కల్పిస్తున్నారు.

మరింకెందుకు ఆలస్యం... మీ వీలుచూసుకుని ఆ పదిరోజులలో వీలైనన్ని సార్లు రండి. మనం అందరం అక్కడ కలుసుకోవచ్చు. కొత్త స్నేహం మొదలు పెట్టవచ్చు. బ్లాగుల గురించి తెలియని వారికి మనకు తెలిసినది పరిచయం చేయవచ్చు.

నాకు కొత్త, అక్కడ నాకు ఎవరూ తెలియదు, ఎవరిని ఎలా కలవాలి? కలిసినా ఏం మాట్లాడాలి ? అని ఆలోచిస్తున్నారా? నాకూ కొత్తే నండీ. నాకూ ఎవరూ తెలియదు. వెళ్లి తెలుసుకోడమే. మాటలు కలపడం మీకు రాకపోతే అక్కడ ఎవరో ఒకరు కలుపుగోలు వ్యక్తులు ఉంటారు లెండి. ముందు బయలుదేరి రండి. తరువాత కాలం దానంతట అదే గడుస్తుంది.

స్థలం: పీపుల్స్ ప్లాజా గ్రౌండ్, నెక్లెస్ రోడ్, పుస్తక ప్రదర్శనా కేంద్రం.
ఎప్పటి నుండి: డిసెంబర్ 17 నుండీ 27 వరకు.
సమయం: మామూలు రోజుల్లో మధ్యహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు
శని ఆది వారాల్లో మధ్యహ్నం 12 గం.ల నుండి రాత్రి 9 గంటల వరకు


అలాగే ఈ నెల 13 వ తేదీన కూడా అంటే రేపే సాయంత్రం 3 గం.ల నుండి , 5 గం.ల వరకు, యూసఫ్ గూడా బస్తీ లో కల కృష్ణకాంత్ ఉద్యానవనం లో కూడా మన తెలుగు బ్లాగరులందరూ కలుస్తున్నారు. నేను వెళ్దామనుకుంటున్నాను. మీరూ వస్తారా?

4 కామెంట్‌లు:

  1. మనమక్కడ కలుస్తామని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. మీ బ్లాగ్ బాగు౦ద౦డీ.
    మా అమ్మ రాసిన రామాయణము గురి౦చి రాసాను .మీకు వీ లైనప్పుడు చూడ౦డి .
    http://kamalamadapati.blogspot.com/2009/07/blog-post_13.html

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు. తప్పకుండా వస్తాను మీ బ్లాగుకు . ఈ రోజు మన బ్లాగరుల దినోత్సవం కదా. క్రిష్ణకాంత్ పార్క్ లో మనవారిని కలవడానికి బయలుదేరుతున్నాను. అందుకే ఇప్పుడు చదవడం కుదరటం లెదు. మళ్లీ కలుస్తా. :)

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.